'చైనా నుంచి పాక్​కు యుద్ధనౌక.. ప్రమాదంలో ఆ ప్రాంతాల భద్రత'

author img

By

Published : Nov 25, 2021, 11:17 PM IST

Navy chief

China's military hardware export to Pak: పాకిస్థాన్​ నేవీకి కావాల్సిన ప్రధాన మిలటరీ హార్డ్​వేర్​ను చైనా సరఫరా చేస్తోందని భారతీయ నేవీ చీఫ్​ అడ్మిరల్​ కరంబీర్​ సింగ్​ పేర్కొన్నారు. ఇది భారత్​లోని చాలా ప్రాంతాల భద్రతను ప్రభావితం చేస్తుందన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

China's military hardware export to Pak: పాకిస్థాన్​కు ఓడలు, జలాంతర్గాములు వంటి మిలిటరీ హార్డ్‌వేర్‌ను చైనా ఎగుమతి చేస్తోందని నేవీ చీఫ్​ అడ్మిరల్​ కరంబీర్​ సింగ్​ అన్నారు. ఇది భారత్​లోని వివిధ ప్రాంతాల భద్రతను ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఈ పరిణామాలన్నింటినీ భారత్​ నిశితంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

స్కార్పెన్ క్లాస్ సబ్‌మెరైన్ ఐఎన్​ఎస్​ వెలాను ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న నేవీ చీఫ్​.. మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఈ నెల ఆరంభంలో పాకిస్థాన్​కు అత్యంత అధునాతన యుద్ధనౌకను చైనా సరఫరా చేసినట్లు విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఈ వ్యాఖ్యలు చేశారు.

చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ రూపొందించి, నిర్మించిన ఈ యుద్ధనౌకను షాంఘైలో జరిగిన కమిషన్ వేడుకలో పాకిస్థాన్​ నేవీకి చైనా అప్పగించింది. 054ఏ/పీ పీఎన్​ రకానికి చెందిన దీనికి పీఎన్​ఎస్​ తుగ్రిల్ అని పేరు పెట్టారు. మొదట నుంచి కూడా చైనా, పాకిస్థాన్​కు ముఖ్యమైన రక్షణ భాగస్వామిగా ఉంటుంది. కీలకమైన సైనిక హార్డ్‌వేర్​లు, ఇతర పరికరాలను అందిస్తోంది.

ఇదీ చూడండి: చైనాకు ఝలక్​.. ఆ ఎన్నికల్లో భారత్​కు జైకొట్టిన ప్రపంచ దేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.