Omicron Reinfection: ఒమిక్రాన్​ను జయించిన వైద్యుడికి మళ్లీ కరోనా

author img

By

Published : Dec 7, 2021, 3:12 PM IST

Updated : Dec 7, 2021, 3:36 PM IST

Omicron Reinfection

Omicron in Karnataka: ఒమిక్రాన్ నుంచి కోలుకున్న బెంగళూరు వైద్యుడికి మళ్లీ కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని బృహత్​ బెంగళూరు మహానగర పాలికె అధికారులు తెలిపారు. ఆ వైద్యుడు ఐసోలేషన్‌లో ఉన్నారని.. ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించారు.

Omicron Reinfection: ఒమిక్రాన్​ను జయించిన బెంగళూరు వైద్యుడికి మళ్లీ కొవిడ్​ సోకింది. ఈ విషయాన్ని బృహత్​ బెంగళూరు మహానగర పాలికె అధికారులు తెలిపారు. ఆ వైద్యుడు ఐసోలేషన్‌లో ఉన్నారని.. అయితే ఎటువంటి లక్షణాలు లేవని పేర్కొన్నారు.

దేశంలో తొలిసారి ఒమిక్రాన్​ పాజిటివ్​గా తేలిన ఇద్దరిలో ఈయన కూడా ఒకరు.

పారిపోయిన వ్యక్తిపై కేసు

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరిని క్వారెంటైన్​లో ఉంచగా.. గుజరాత్​కు చెందిన వ్యక్తి దుబాయ్​కు పారిపోయాడు. అధికారులకు సమాచారం ఇవ్వకుండా.. క్వారెంటైన్​ నిబంధనలు ఉల్లఘించినందుకు అతనిపై పోలీసు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇన్​ఫెక్షన్​ సోకిన వ్యక్తిని అనుమతించినందుకు ఓ ఫైవ్​స్టార్​ హోటల్​ యాజమాన్యం, సిబ్బందిపై కూడా కేసు నమోదు చేశారు.

మరో ఒమిక్రాన్​ కేసు!

Omicron in Madhya Pradesh: దేశంలో ఒమిక్రాన్​ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో.. మధ్యప్రదేశ్​లో జర్మనీకి చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడినట్లు నిర్ధరణ అయింది. దీంతో ఆ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. ఆ వ్యక్తిని స్థానిక ఐసోలేషన్​ సెంటర్​లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు చెప్పారు.

ఆ వ్యక్తి ఆదివారం సాయంత్రం ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడని.. ఆయన కాంటాక్ట్​ అయిన 50 మంది నమూనాలను సేకరించినట్లు పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్​, రాజస్థాన్, దిల్లీలో ఒమిక్రాన్​ కేసులు బయటపడిన నేపథ్యంలో ఈ కేసుతో రాష్ట్ర ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి: పెళ్లయిన కొద్దిగంటలకే నవవధువుపై కాల్పులు

Last Updated :Dec 7, 2021, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.