ఉద్యోగులకు రెండు రోజులు ఎక్స్​ట్రా సెలవులు- అమ్మ, నాన్నతో గడిపేందుకే...

author img

By

Published : Nov 25, 2021, 4:09 PM IST

employees to get 4 days leave to meet parents

Leaves For Employees: కొత్త సంవత్సరం కానుకగా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది అసోం రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగం కారణంగా తల్లిదండ్రులతో గడిపేందుకు సరైన సమయం కేటాయించలేని వారికి ప్రత్యేక సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ(Himanta Biswa Sarma News).

Leaves For Employees: కొత్త ఏడాది కానుకగా అసోం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​ చెప్పింది హిమంతబిశ్వ శర్మ సర్కార్​. వచ్చే ఏడాది జనవరిలో మొత్తంగా నాలుగు రోజులు పాటు సెలవును ప్రకటించింది. జనవరి 6 నుంచి 9వ తేదీ వరకు తల్లిదండ్రులు, అత్తమామలతో కలిసి గడిపేందుకు సెలవు (leave for employees to meet parents) తీసుకోవచ్చని అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ (himanta biswa sarma news) తెలిపారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

"తల్లిదండ్రులతో గడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజులు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఏడాది జనవరి 8, 9 తేదీలు ప్రభుత్వం సెలవు దినాలు. వాటికి అదనంగా 6,7 తేదీలను కూడా సెలవు దినాలుగా ప్రకటిస్తున్నాం. తల్లిదండ్రులు, అత్తమామలు ఉన్నవారు ఈ నాలుగు రోజులను కొత్త ఏడాది సందర్భంగా వారితో గడిపేందుకు వినియోగించుకోవచ్చు."

- హిమంతబిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి

తల్లిదండ్రులు, అత్తమామలు బతికి ఉన్న వారికే ఈ సెలవులను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి శర్మ. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వారు కూడా ఈ సెలవులను ఉపయోగించుకోవడానికి అర్హులు అని చెప్పారు.

ఇదీ చూడండి: ఆరు నెలల తర్వాత ముంబయిలో ప్రత్యక్షమైన పరమ్​బీర్ సింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.