సోదరుడు రాలేదని.. అల్లుడిపై మహిళ హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..!

author img

By

Published : May 22, 2022, 12:13 PM IST

woman attacks her 10-yr-old nephew with knife

Woman Attacks Nephew: సోదరుడిపై కోపాన్ని అతడి కుమారుడిపై చూపించింది ఓ మహిళ. పదేళ్ల బాలుడిపై కత్తితో దాడి చేసింది. మధ్యప్రదేశ్​ భోపాల్​లో శనివారం జరిగిన ఈ ఘటనలో.. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఓ మహిళ.. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన దిల్లీ వసంత్​ విహార్​లో వెలుగుచూసింది.

Woman Attacks Nephew: మధ్యప్రదేశ్​లో దారుణం జరిగింది. తన తల్లి అంత్యక్రియలకు రాలేదని.. సొంత సోదరుడి కుమారుడిపై హత్యాయత్నం చేసింది ఓ మహిళ. కత్తితో దాడి చేసింది. తీవ్రగాయాలపాలైన పదేళ్ల బాలుడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భోపాల్​ హనుమాన్​గంజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఖాజీ క్యాంప్​ సమీపంలో శనివారం జరిగిందీ ఘటన.

ఇదీ జరిగింది: ఖాజీ క్యాంప్​ ప్రాంతంలోని.. తన నాన్నమ్మ ఇంట్లోనే ఉంటున్నాడు పదేళ్ల బాలుడు. శనివారం ఆమె చనిపోయింది. ఈ క్రమంలోనే ఝాన్సీలో ఉంటే బాలుడి తల్లిదండ్రులు.. తల్లి అంత్యక్రియల కోసం భోపాల్​ రాలేదని కోపం పెంచుకుంది మృతురాలి కూతురు ఆస్మా(40). క్షణికావేశంలో సోదరుడి కుమారుడిపై(అల్లుడు) కత్తితో దాడి చేసింది. నిందితురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రిని చంపిన తనయుడు: మహారాష్ట్రలో దారుణం జరిగింది. 70 ఏళ్ల వయసున్న తండ్రిని హత్య చేశాడు 40 ఏళ్ల ఓ వ్యక్తి. నిందితుడు మానసిక వికలాంగుడు అని తెలిపారు పోలీసులు. పాల్ఘర్​లోని మోఖ్డా వద్ద శనివారం జరిగిందీ ఘటన. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదు.

పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య?: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తమ ఫ్లాట్​లో విగతజీవులుగా కనిపించారు. దిల్లీ వసంత్​ విహార్​ ప్రాంతంలో శనివారం సాయంత్రం వెలుగులోకి వచ్చిందీ ఘటన. మృతులను మంజు, ఆమె కుమార్తెలు.. అన్షికా, అంకుగా గుర్తించారు. ఫ్లాట్​ నెం. 207 లోపలి నుంచి లాక్​ వేసుందని, ఎవరూ స్పందించట్లేదని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లగా ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. స్వల్పంగా గ్యాస్​ లీక్​ అవుతున్నట్లు గుర్తించారు పోలీసులు. అక్కడే సూసైడ్​ నోట్​ కూడా లభ్యమైంది.
గతేడాది ఏప్రిల్​లో మృతురాలి భర్త కరోనా వైరస్​కు బలయ్యాడు. ఆ బాధలో మంజు కూడా అనారోగ్యం కారణంగా కొద్దిరోజులకే మంచానికే పరిమితమైంది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

కోడిపై కేసు: మధ్యప్రదేశ్​ సీహోర్​లోని ఆష్ఠా పోలీస్​ స్టేషన్​లో వింత కేసు నమోదైంది. ఓ పెంపుడు కోడి దాడి చేయగా.. ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయని బాధితులు ఫిర్యాదు చేశారు. తొలుత ఆశ్చర్యపోయిన పోలీసులు.. తర్వాత కోడిపై పలు సెక్షన్ల కింద నమోదు చేయడం గమనార్హం. కోడిని స్టేషన్​కు తీసుకురావాలని యజమానికి స్పష్టం చేశారు. తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. భగీరథ్​ కుష్వాహా ఇంటికి పొరుగింట్లోని ప్రకాశ్​ మెహ్తర్​కు చెందిన కోడి వచ్చింది. ఆ సమయంలో భగీరథ్​ తమ్ముడు, మేనల్లుడిపై దాడి చేసి గాయపరిచిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవీ చూడండి: 22 లక్షల విలువైన మద్యం సీసాలు.. రోడ్డు రోలర్​తో తొక్కించారు..!

మందుకొట్టి అమ్మాయిల రచ్చ.. రేంజ్​ రోవర్​తో ఢీ.. ఒకరు మృతి.. ఎస్సైపైనా దాడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.