ఘోర ప్రమాదం- ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

author img

By

Published : Jan 11, 2022, 6:34 AM IST

snowfall in Shimla

Accident in Shimla: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మంచు దట్టంగా కురవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Accident in Shimla: హిమాచల్​ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సిమ్లా జిల్లాలోని కుప్వి ప్రాంతంలో జరిగింది. మంచు దట్టంగా కురుస్తున్న రోడ్డుపై ప్రయాణించడం వల్ల కారు అదుపు తప్పి.. లోయలో పడిపోయింది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. వీరంతా సిమ్లాలో ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు.

బాధితులు కుప్విలోని నౌరా-బౌరా పంచాయతీ నివాసితులుగా పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: క్రిప్టోకరెన్సీ పేరుతో రూ.1,200కోట్లకు టోకరా.. ఈడీ కొరడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.