ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు సహా ఏడుగురు దుర్మరణం

author img

By

Published : Sep 26, 2022, 6:46 AM IST

Updated : Sep 26, 2022, 5:35 PM IST

accident in kullu today

పర్యాటకులతో వెళ్తున్న ఓ టెంపో అదుపు తప్పి వాగులో పడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 10మంది గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులులో అర్ధరాత్రి జరిగింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులులో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఓ టెంపో అదుపు తప్పి వాగులో పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 10మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా హరియాణా, దిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లకు చెందిన వారని అధికారులు వెల్లడించారు. మృతులను దిల్లీకి చెందిన సౌరభ్, ప్రియాంక గుప్తా, కిరణ్​.. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన రిషభ్​ రాజ్​, అన్షిక జైన్​, ఆదిత్యగా గుర్తించారు.

Last Updated :Sep 26, 2022, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.