తమిళనాడు వాసులకు కేరళలో జాక్​పాట్​.. రూ.10కోట్ల లాటరీ..

author img

By

Published : May 31, 2022, 8:05 AM IST

2-tn-natives-win-rs-10-crore-in-kerala-lottery

Kerala Lottery: తమిళనాడుకు చెందిన ఇద్దరికి కేరళలో రూ.10కోట్ల లాటరీ తగిలింది. కొద్ది రోజుల క్రితం విదేశం నుంచి వచ్చిన తమ బంధువుకు తీసుకొచ్చేందుకు తిరవనంతపురం ఎయిర్​పోర్టు వెళ్లిన వారు ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. అదృష్టవశాత్తు లక్కీ డ్రాలో ఆ టికెట్ నంబరే వచ్చింది.

Kerala Vishu Bumper lottery: అదృష్టం ఎప్పుడు ఎలా తలపుతడుతుందో తెలియదు అంటారు. వీరి విషయంలోనూ సరిగ్గా ఇలానే జరిగింది. తమిళనాడు కన్యాకుమారికి చెందిన డా.ఎం ప్రదీప్​, అతని బంధువు ఎన్ రమేశ్​కు కేరళలో జాక్​పాట్ తగిలింది. ఒకే కుటుంబానికి చెందిన వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం విదేశం నుంచి వచ్చిన తమ బంధువును తీసుకొచ్చేందుకు తిరువనంతపురం ఎయిర్​పోర్టు వెళ్లారు. అప్పుడే కేరళ విషు బంపర్ లాటరీ టికెట్ నడుస్తోంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఓ ఏజెంట్​ వద్ద టికెట్​ కొనుగోలు చేశారు. అయితే ఊహించని విధంగా వీరు కొనుగోలు చేసిన టికెట్​కే రూ.10కోట్ల లాటరీ తగిలింది.

మే 15న ఈ లాటరీ డ్రా తీశారు. ప్రదీప్, రమేశ్ రూ.10కోట్లు గెలుచుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో వారు సోమవారం లాటరీ భవన్​కు వెళ్లి టికెట్​తో పాటు అవసరమైన పత్రాలు సమర్పించారు. రూ.10 కోట్లు తీసుకెళ్లారు.

ఇదీ చదవండి: కూతురి కోసం 'కులం లేని ధ్రువపత్రం'... తల్లిదండ్రుల ఆదర్శం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.