బంగారంతో భారీ గణపతి, 18 అడుగుల ఎత్తులో కాంతులీనుతూ

By

Published : Aug 25, 2022, 1:07 PM IST

thumbnail

అందరూ ఎదురుచూస్తున్న మన గణేశుని పండుగ త్వరలో రానుంది. చవితి నాడు ఇళ్లలోనే కాదు వీధుల్లో దర్శనమిచ్చే వినాయకులను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. విభిన్నరకాల గణపతులను చూసే భక్తుల కోసం యూపీలోని ఛందౌసీలోనూ ఓ గణనాథుడు రూపుదిద్దుకుంటున్నాడు. మేలిమి బంగారు కాంతులీనుతూ భక్తుల పూజలు అందుకునేందుకు ముస్తాబవుతున్నాడు. 1‍8 అడుగుల ఎత్తుండే ఈ స్వర్ణ గణేశుణ్ని బంగారం వినియోగించి తయారు చేస్తున్నారు. 40 నుంచి 50 శాతం బంగారం, మిగతాది ఇతర లోహాలు ఉపయోగించి చేస్తున్నట్లు తయారీదారులు తెలిపారు. కొవిడ్​ ముందు ఇక్కడ భారీ ఎల్​ఈడీ వినాయకుడు దర్శనమివ్వగా ఈ ఏడాది రానున్న స్వర్ణ గణేశుడిని స్వాగతించడానికి ఛందౌసీ వాసులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.