PRATIDWANI: ట్రూఅప్ వడ్డనతో ఈ ప్రభుత్వానికి సంబంధం లేదా?
రాష్ట్రంలో.. విద్యుత్ బిల్లులు షాక్ కొడుతున్నాయి. ట్రూఅప్తో చేసిన అదనపు ఛార్జీల వడ్డన ఉలిక్కి పడేలా చేస్తోంది. యూనిట్కు ఒక రూపాయి 23పైసల చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఆ అయిదేళ్ల అదనపు మొత్తాన్ని రాబోయే 8 నెలల్లో భర్తీ చేసుకుంటామని విద్యుత్ పంపిణీ సంస్థలు చెబుతున్నాయి. సందట్లో సడేమియాగా మరో 2,542కోట్ల సర్దుపోటుకూ రంగం సిద్ధం చేసేస్తున్నారు. 2019-20లో అనుమతించిన వ్యయానికి.. వాస్తవఖర్చులకు మధ్య వ్యత్యాసం అంటూ.. మరో బాదుడు కోసం ఏపీఈఆర్సీలో ట్రూఅప్ పిటిషన్ దాఖలు చేశారు. అసలు ఎందుకీ భారాలు? ఈ షాకులను జనం తట్టుకునేది ఎలా? ఇదే అంశంంపై నేటి ప్రతిధ్వని