Prathidwani: రోహిత్కు పగ్గాలివ్వటం సరైందేనా..వన్డే కెప్టెన్గా అతని ముందున్న సవాళ్లేంటి ?
భారత క్రికెట్ వన్డే జట్టుకు హిట్మ్యాన్ రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టాడు. టీ ట్వంటీ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాక ఆ బాధ్యతలు స్వీకరించిన రోహిత్శర్మకే ఇప్పుడు వన్డే జట్టు కెప్టెన్సీని అప్పగించింది సెలక్షన్ కమిటీ. పరిమిత ఓవర్ల ఫార్ములాలో ఇద్దరు కెప్టెన్లకు బదులు ఒకే కెప్టెన్ ఉండడం మంచిదని భావించిన బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ కెప్టెన్గా విజయాల రికార్డులు రోహిత్కు కలిసివచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత వన్డే జట్టు బలాబలాలు ఏంటి? రానున్న రోజుల్లో జట్టులో ఎలాంటి మార్పులు ఉండొచ్చు? టెస్ట్ జట్టు కెప్టెన్గా కోహ్లీ ముందున్న లక్ష్యమేంటి ? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.