అమ్మాయిల హాకీ మ్యాచ్​లో గొడవ.. ఫైనల్ మ్యాచ్ రద్దు

By

Published : Nov 29, 2021, 5:15 PM IST

thumbnail

ఆల్​ ఇండియా హాకీ మహిళల టోర్నమెంట్​లో షాకింగ్​ ఘటన జరిగింది. హాకీ స్టిక్​తో ఓ క్రీడాకారిణి​పై మరో ప్లేయర్ దాడి చేసింది. రిషికేశ్​లో జరుగుతున్న ఈ టోర్నీ ఫైనల్​ మ్యాచ్​లో మేరఠ్​​, కోల్​కతా పోటీపడ్డాయి. మ్యాచ్​లో భాగంగా మేరఠ్​ టీంకు చేందిన శివానీ.. కోల్​కతా టీం క్రీడాకారిణి మమతకు అనుకోకుండా హాకీ స్టిక్​ తగిలించింది. ఈ క్రమంలో మమత కోపంతో శివానీ చేతిపై స్టిక్​తో బలంగా కొట్టింది. బాధిత ప్లేయర్​ను ఆసుపత్రికి తరలించారు. రెండు టీంలపై అనర్హత వేటు వేసిన నిర్వాహకులు.. మ్యాచ్​ను రద్దు చేశారు. అనంతరం రెండు టీంలను విజేతలుగా ప్రకటించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.