అమ్మాయిల హాకీ మ్యాచ్లో గొడవ.. ఫైనల్ మ్యాచ్ రద్దు
ఆల్ ఇండియా హాకీ మహిళల టోర్నమెంట్లో షాకింగ్ ఘటన జరిగింది. హాకీ స్టిక్తో ఓ క్రీడాకారిణిపై మరో ప్లేయర్ దాడి చేసింది. రిషికేశ్లో జరుగుతున్న ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో మేరఠ్, కోల్కతా పోటీపడ్డాయి. మ్యాచ్లో భాగంగా మేరఠ్ టీంకు చేందిన శివానీ.. కోల్కతా టీం క్రీడాకారిణి మమతకు అనుకోకుండా హాకీ స్టిక్ తగిలించింది. ఈ క్రమంలో మమత కోపంతో శివానీ చేతిపై స్టిక్తో బలంగా కొట్టింది. బాధిత ప్లేయర్ను ఆసుపత్రికి తరలించారు. రెండు టీంలపై అనర్హత వేటు వేసిన నిర్వాహకులు.. మ్యాచ్ను రద్దు చేశారు. అనంతరం రెండు టీంలను విజేతలుగా ప్రకటించారు.