Two persons Suicide: ప్రకాశం జిల్లాలో విషాదం.. ట్రైన్​ కింద పడి వదిన, మరిది ఆత్మహత్య

By

Published : May 23, 2023, 5:13 PM IST

thumbnail

Two People Died in Prakasam District: ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొంది. రైలు కింద పడి మరిది, వదిన ఆత్మహత్య చేసుకున్నారు. ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు(30), రాములమ్మ(27) వదినా మరిదిలు. గత కొంతకాలంగా వీరు వివాహేతరం సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇద్దరు ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిపోయారు. అనంతరం కంభం మండలం సైదాపురం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీనివాసులుకు రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మృతురాలు రాములమ్మకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.