Thalassemia Affected Children Protest: 'మా చదువులకు ఇబ్బంది కలిగించకండి'.. తలసేమియా బాధిత పిల్లల నిరసన
Thalassemia ffected children Protest : 'మేము తలసేమియా వ్యాధి (Thalassemia disease) తో బాధపడుతున్న పిల్లలం.. మమ్మల్ని అధికారులు ఆదుకోవాలి' అని తలసేమియా పిల్లలు కడప కలెక్టరేట్ వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. గతంలో వలే అధికారులు తమకు ఒక రోజులోనే రక్తం ఎక్కించి పంపించాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ ఎదుట తలసేమియా బాధిత పిల్లలు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డుల పట్టుకొని నినాదాలు చేశారు.
జిల్లావ్యాప్తంగా దాదాపు 110 మంది తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలు ఉన్నారు. వీరందరికీ ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాలి. గతంలో పిల్లలకు రక్తం ఎక్కించాలంటే ఒక రోజులోనే ఎక్కించి ఇంటికి పంపించేవారు. కానీ ఇప్పుడు కడప రిమ్స్ (Kadapa RIMS) అధికారులు రెండు రోజులపాటు పిల్లలను ఆస్పత్రిలో ఉంచుకోవడం వల్ల పిల్లల చదువులకు ఇబ్బందిగా ఉందని తల్లిదండ్రులు వాపోయారు. నెలలో రెండు సార్లు అంటే కనీసం వారం రోజులపాటు విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు స్పందించి గతంలో వలే ఒకరోజులోనే పిల్లలకు రక్తం ఎక్కించి పంపించాలని కోరారు. 'మమ్మల్ని కాపాడండి' అంటూ పిల్లలు వేడుకున్నారు. తలసేమియా బాధిత పిల్లల పట్ల కలెక్టర్ స్పందిస్తూ.. గతంలో వల్లే పిల్లలకు ఒక రోజులోనే రక్తం ఎక్కించి పంపించాలని అధికారులను ఆదేశించారు.