రథమెక్కి స్టేడియంలో తిరిగిన మోదీ, అల్బనీస్.. కెప్టెన్లతో కలిసి జాతీయ గీతాలాపన

By

Published : Mar 9, 2023, 11:03 AM IST

thumbnail

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా భారత్​ ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్​ మ్యాచ్ గురువారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యింది. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్​ను తిలకించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్​ హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన ఇరువురు ప్రధానులు.. ఓ ప్రత్యేకమైన వాహనం ఎక్కిన మోదీ ఆల్బనీస్​, స్టేడియంలో కాసేపు తిరిగారు. ఆ తర్వాత తమ జట్టు కెప్టెన్లైన రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్‌లకు టెస్ట్ క్యాప్‌లను అందజేశారు. భారత్​కు, ఆస్ట్రేలియా మధ్య ఉన్న 75 సంవత్సరాల స్నేహానికి గుర్తుగా ఇరు ప్రధానులను బీసీసీఐ ప్రెసిడెంట్​ రోజర్​ బిన్నీ సన్మానించారు. కాగా, ఆస్టేలియా టీమ్​ టాస్​లో గెలిచి బ్యాటింగ్​ను ఎంచుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ అంటోనీ అల్బనీస్​ తమ తమ జట్లతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని తిలకించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.