రైతుకు అధికారులు లంచం డిమాండ్​.. డబ్బు బదులు ఎద్దు ఇస్తానంటూ..

By

Published : Mar 10, 2023, 8:48 PM IST

Updated : Mar 10, 2023, 9:10 PM IST

thumbnail

అప్పటి వరకు ఓపిక పట్టిన రైతుకు సహనం నశించింది. లంచం అడిగిన అధికారులకు డబ్బుకు బదులు ఎద్దును ఇస్తానని ఏకంగా మున్సిపల్​ కార్యాలయానికే ఎద్దును తీసుకెళ్లాడు. అప్పటికే లంచం ఇచ్చిన అధికారులు బదిలీ కావడం వల్ల మళ్లీ ఇచ్చుకోలేనని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.  

హవేరి జిల్లాలోని సవనూర్​ మున్సిపాలిటీకి చెందిన ఎల్లప్ప రానోజి అనే రైతు.. మున్సిపల్ రికార్డుల్లో మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తన పని జరగాలంటే లంచం ఇవ్వాలని అధికారులు ఎల్లప్పను డిమాండ్​ చేశారు. అధికారులకు ఎల్లప్ప లంచం ఇచ్చాడు. అయితే, ఎల్లప్ప పని చేయకుండానే ఆ ఆఫీసర్లు వేరే చోటుకు ట్రాన్స్​ఫర్​ అయ్యారు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. కొత్త ఆఫీసర్లు కూడా ఎల్లప్పను లంచం డిమాండ్​ చేశారు. దీంతో నిస్సహాయుడైన ఎల్లప్ప.. అధికారులపై నిరసన తెలియజేయాలనుకున్నాడు. వెంటనే తన ఎద్దును తీసుకుని మున్సిపల్​ కార్యాలయానికి వెళ్లాడు. లంచానికి బదులు ఈ ఎద్దును తీసుకోవాలని కోరాడు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు.. ఎల్లప్పకు సంబంధించిన రికార్డుల్లో మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు లంచం అడిగిన అధికారులకు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు.  

Last Updated : Mar 10, 2023, 9:10 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.