మద్యం తాగి కారు నడిపిన వ్యక్తి.. చెప్పుతో కొడుతూ మహిళ దేహశుద్ధి

By

Published : May 20, 2023, 10:20 AM IST

thumbnail

డ్రంక్​ అండ్​ డ్రైవ్​ చేసిన వ్యక్తికి దేహశుద్ధి చేసింది ఓ మహిళ. మద్యం తాగి డ్రైవింగ్ చేసినందుకు చెప్పుతో కొట్టింది. మద్యం మత్తులో బైక్​, ఆటోలను ఢీకొట్టినందుకు ఈ తరహాలో బుద్ధి చెప్పింది. కర్ణాటకలోని విజయపుర​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. డ్రైవర్​పై మహిళ దాడి చేస్తున్న దృశ్యాలను అక్కడున్న వారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు.  

గురువారం రాత్రి మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్​ వీరంగం సృష్టించాడు. ఓ బైక్​ను రెండు ఆటోలను ఢీకొట్టాడు. దీంతో ఆటో బోల్తా పడింది. ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ మహిళ డ్రైవర్​ వద్దకు వచ్చి.. ఎడాపెడా వాయించింది. చెప్పుతో సైతం కొట్టింది. విజయపుర సిటీలోని స్టేషన్​ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు గాను డ్రైవర్​పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడిని అదుపులోకి కూడా తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.