కుక్కకు 'బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్​ ద మంత్' అవార్డ్.. క్యాష్ ప్రైజ్.. ఎందుకంటే..?

By

Published : Mar 12, 2023, 7:41 PM IST

thumbnail

ఉత్తరాఖండ్​ పోలీస్ శాఖకు చెందిన ఓ కుక్క 'బెస్ట్​ ఎంప్లాయీ ఆఫ్​ ద మంత్'​గా అవార్డు పొందింది. ఓ హత్య కేసును ఛేదించినందుకు ఈ పురస్కారాన్ని అందించారు అధికారులు. రూ. 2,500 నగదు పురస్కారాన్ని అందజేశారు. జస్పుర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో మార్చి 6న షకీబ్​ అహ్మద్​ అనే వ్యక్తి హత్య జరిగింది. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు డాగ్​ స్క్వాడ్​ను రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే అనుమానితులను వరుసగా నిలబెట్టగా.. కేవలం 30 సెకన్లలోనే నిందితుడిని పట్టించింది ఈ శునకం. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం చేసినట్లు అంగీకరించాడు. ఈ కేసును ఛేదించడంలో శునకం కీలక పాత్ర పోషించిందని.. అందుకే అవార్డుతో పాటు నగదు పురస్కారాన్ని ప్రకటించామని ఉద్దమ్​ సింగ్ నగర్​ ఎస్​ఎస్​పీ మంజునాథ్​ తెలిపారు. 2016లో హరియాణాలోని పంచకుల ఐటీబీపీ కేంద్రంలో ఈ శునకానికి శిక్షణ ఇచ్చారు. అనంతరం ఉద్దమ్​సింగ్​ నగర్​లో పోస్టింగ్​ ఇచ్చారు. అనేక హత్య కేసుల్లో పోలీసులకు సహాయం అందించింది. ప్రస్తుతం 8 ఏళ్ల వయసున్న ఈ శునకం ట్రాకర్ డాగ్​గా పేరొందింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.