బస్సుపై అత్యంత ప్రమాదకర రీతిలో విద్యార్థులు ప్రయాణిస్తున్న ఘటన కర్ణాటక కోలార్ జిల్లాలోని శ్రీనివాసపుర్లో జరిగింది. ఎలాంటి భయం లేకుండా, ప్రాణాలను లెక్కచేయకుండా.. విద్యార్థులు.. ఆ ప్రైవేటు బస్సు మీద, కిటీకీలు, రాడ్డులు పట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఈ దృశ్యాలను ఓ స్థానికుడు తన ఫోన్ కెమెరాతో షూట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే.. బస్సుల సంఖ్య తక్కువగా ఉండటం, ప్రతిసారీ ఆలస్యమవుతుండటం వల్ల తాము ఇలా చేయక తప్పడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. వీడియో చూసిన వారు.. స్థానిక అధికారులపై మండిపడుతున్నారు.