కర్రలతో కొట్టి.. చిత్రహింసలు పెట్టి.. యువకుడి దారుణ హత్య

By

Published : Oct 13, 2021, 5:59 PM IST

thumbnail

ఓ యువకుడ్ని 15 మంది వ్యక్తులు కొట్టి చంపిన ఘటన హరియాణాలో వెలుగుచూసింది. మహేంద్రగఢ్‌లోని మాల్దా గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. తనను వదిలేయమని ప్రాధేయపడుతున్నప్పటికీ గౌరవ్​ను కొందరు కర్రలతో దారుణంగా కొట్టడం దీనిలో గమనించవచ్చు. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గౌరవ్​ అనే వ్యక్తికి, అతని స్నేహితుడు రవికి మధ్య గొడవ జరిగిందని.. దీనితో రవి తన సహచరులతో కలిసి గౌరవ్​పై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. అయితే గౌరవ్ తమను చంపేస్తానని బెదిరించాడని.. అందుకే కొట్టామని ప్రధాన నిందితుడు చెప్పడం గమనార్హం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.