పార్టీ టికెట్​ ఇవ్వలేదని.. బోరున విలపించిన కార్యకర్త

By

Published : Jan 14, 2022, 5:24 PM IST

thumbnail

BSP Leader Crying: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో టికెట్​ ఆశించి భంగపడ్డ ఓ బీఎస్​పీ కార్యకర్త బోరున విలపించారు. పార్టీ కోసం 24 ఏళ్లుగా కష్టపడ్డా.. చివరి నిమిషంలో తనకు టికెట్​ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు అర్షద్​ రాణా. పార్టీ కోసం హోర్డింగ్​లు కూడా కట్టానని.. ఇప్పుడు ఇలా చేయడం సరికాదని అన్నారు. ముజఫుర్​నగర్​ బీఎస్​పీ జిల్లా అధ్యక్షుడు సతీశ్​ కుమార్​ను కలిస్తే.. రూ. 50 లక్షలు ఏర్పాటు చేయాలని అడిగినట్లు ఆరోపించారు రాణా. ఇప్పటికే రూ. 4.5 లక్షలు ఇచ్చానని చెప్పారు. రాణా విలపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.