ఎన్నికల విధుల కోసం సిబ్బంది సాహసం ఈవీఎంలతో సముద్ర ప్రయాణం

By

Published : Nov 30, 2022, 8:57 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

డిసెంబర్​ 1న జరగబోయే గుజరాత్​ ఎన్నికల విధుల కోసం కొందరు సిబ్బంది సాహసం చేశారు. రాజుల నియోజకవర్గంలో ఉన్న షియాల్​బెట్​ అనే ద్వీపానికి సముద్రంలో ప్రయాణించారు. ఈవీఎంలతో సహా 50 మంది ఎన్నికల యంత్రాంగం చిన్నచిన్న పడవుల్లో ప్రయాణించి మరీ అక్కడకు చేరుకున్నారు. ప్రస్తుతం ఈ ద్వీపంలో 7,700 మంది మత్య్సకార ఓటర్లు ఉండగా 5 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ ఓట్ల కోసం సముద్రం మధ్యలో ఉన్న నక్క గబ్బిలం దీవికి సిబ్బందితో పాటుగా పోలీసులు కూడా చేరుకున్నారు. పడవలో ప్రయాణించి మరీ ఎన్నికల విధుల్లో పాల్గొనడం చాలా థ్రిల్లింగ్​గా ఉందని సిబ్బంది చెప్పారు. గతంలో కూడా సిబ్బంది ఇలానే సముద్రంలో ప్రయాణించి విధుల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.