పోలీసులపైకి దూసుకొచ్చిన కారు.. కానిస్టేబుల్​కు తీవ్ర గాయాలు..

By

Published : Sep 20, 2022, 11:22 AM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail

మధ్యప్రదేశ్ భోపాల్​లోని హోషంగాబాద్​లో​ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిల్చున్న నలుగురు పోలీసులపైకి ఓ కారు వేగంగా దూసుకువచ్చి ఢీ కొట్టింది. వేగంగా వస్తున్న కారును గమనించిన గమనించిన ముగ్గురు పోలీసులకు పక్కగా జరగగా.. బైక్​పై కూర్చొన్న ధరమ్​రాజ్ అనే కానిస్టేబుల్​ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ధరమ్​రాజ్​.. భోపాల్​లోని ఓ ప్రైవేట్ అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానిక సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు నమోదయ్యాయి. శనివారం రాత్రి జరిగిందీ ఘటన. కారు డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.