వైయస్‌ఆర్‌ జిల్లాలో బాలికపై 10 మంది అత్యాచారం.. కేసును ఆలస్యం చేయలేదు: ఎస్పీ

author img

By

Published : May 12, 2022, 5:10 AM IST

Updated : May 13, 2022, 4:53 AM IST

అత్యాచారం

రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనల పరంపర పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఓ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంటోంది. ఎన్ని కేసులు పెట్టినా.. శిక్షలు వేసినా మార్పు రావడంలేదు. తాజాగా వైఎస్ఆర్​ జిల్లాలో బాలికపై గత కొంతకాలంగా ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. అయితే.. ఈ ఘటనలో కేసును పోలీసులు ఆలస్యం చేశారనడంలో వాస్తవం లేదని.. నిన్ననే కేసు నమోదు చేశారని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై గత కొంతకాలంగా ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిసి మొత్తం 10 మంది అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం తెలిసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కేసు నమోదు చేయలేదనే విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీ అన్బురాజన్‌ స్పందించారు.

బాలికపై అత్యాచారం ఘటనలో నిన్ననే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. కేసును పోలీసులు ఆలస్యం చేశారనడంలో వాస్తవం లేదు. ఆరు నెలల కిందట బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. నాలుగు నెలల కిందట మరో ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలికను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు అదనపు ఎస్పీ పూజితను ఆదేశించాం. ఆమె ప్రస్తుతం ప్రొద్దుటూరు వెళ్లి విచారణ చేస్తున్నారు. -అన్బురాజన్‌, జిల్లా ఎస్పీ

అత్యాచార ఘటన.. కేసును ఆలస్యం చేయలేదు: ఎస్పీ అన్బురాజన్‌

న‌లుగురు నిందితుల‌ు అరెస్టు: ప్రొద్దుటూరులో బాలిక పై అత్యాచారం జ‌రిగిన ఘ‌ట‌న‌లో న‌లుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల‌ను రిమాండుకు త‌ర‌లించారు. ప్రొద్దుటూరులో ఒక‌టో ఠాణాలో నిందితుల వివ‌రాలు క‌డ‌ప ఏఎస్పీ పూజితా నీలం వెల్ల‌డించారు. గ‌ర్భం దాల్చిన బాలిక వ‌న్‌టౌన్ పీఎస్ ప‌రిధిలో తిర‌గుతోంద‌ని వ‌న్‌టౌన్ పోలీసుల‌కు స‌మాచారం వ‌చ్చింద‌న్నారు. బాలిక‌ను విచారించేందుకు మ‌హిళా పోలీస్ స్టేష‌న్‌కు రావాల‌ని పిలిచినా రాకుండా ఇంటికి వెళ్లిపోయింద‌న్నారు. త‌ర్వాత 8 తేదీ అమృత‌న‌గ‌ర్‌లో తిరుగుండ‌గా..మ‌రో జీఎంఎస్‌కే రూర‌ల్ పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లార‌న్న ఏఎస్పీ అక్క‌డ కూడా బాలిక త‌న వివ‌రాలు చెప్ప‌లేద‌న్నారు. బాలిక బంధువులు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఎస్సై ఆమెను మైల‌వ‌రం డాడీహోంకు త‌ర‌లించార‌ని పూజితా తెలిపారు. 9వ‌త తేదీన బాలిక బంధువులు, తండ్రిని గుర్తించి వారిని ఫిర్యాదు చెయ్యాల‌ని కోర‌గా..వారు స్పందించ‌లేద‌న్నారు. దీంతో 11వ తేదీ ఐసీడీఎస్ సిబ్బందితో ఫిర్యాదు తీసుకుని కేసు న‌మోదు చేసి బాలిక పై అత్యాచారం చేసిన న‌లుగురిని అరెస్టు చేశార‌ని ఏఎస్పీ వివ‌రించారు.

అసలు ఏం జరిగిందంటే...: ప్రొద్దుటూరు పట్టణంలోని ఇస్లాంపురంలో ఓ మైనరు బాలిక భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. తండ్రి మరో ఆలయం వద్ద భిక్షాటన చేస్తుంటారు. ఆమె తల్లి చాలా ఏళ్ల కిందట చనిపోయారు. ఆ బాలికపై అదే వీధిలో బంధువుల ఇంట్లో ఉంటూ ఓ డెకరేషన్‌ దుకాణంలో పని చేస్తున్న యువకుడు చెంబు కన్నుపడింది. చెంబు, అతని స్నేహితులు గత కొంతకాలంగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకొచ్చింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈనెల 4న మహిళా కానిస్టేబుల్‌ మల్లీశ్వరి ..బాధితురాలితో మాట్లాడి అన్ని వివరాలను సేకరించారు. తనపై చెంబు, అతని స్నేహితులు అఘాయిత్యం చేసినట్లు బాధితురాలు వివరించింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగా... ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమని వారు సమాధానమిచ్చారని పేర్కొంది. ఆ బాలిక చెప్పిన సమాచారం మొత్తాన్ని కానిస్టేబుల్‌ రికార్డు చేశారు. అనంతరం పట్టణంలోని ఓ సీఐ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం బయటకు పొక్కకుండా బాధితురాలిని గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అమృతనగర్‌లో ఉన్న ఓ ఆశ్రమానికి తరలించేలా చర్యలు తీసుకున్నారు సీఐ.

ఈ సమాచారం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు.. కేసు నమోదు చేయకుండా ఆ బాలికను ఈ నెల 8న మైలవరంలోని ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆశ్రమానికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ ఆశ్రయం పొందుతున్నట్లు తెలిసింది. ఈ సమాచారం తెలిసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కేసు నమోదు చేయలేదనే విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో బాలికపై అత్యాచార ఘటన మా దృష్టికి వచ్చిందని ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. విచారణకు ఆదేశించామని.. ఎవరినీ ఉపేక్షించంబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా.. తాజాగా జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ స్పందించారు.

ఇదీ చదవండి; బాలిక​పై లైెంగిక దాడికి యువకుడు యత్నం.. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

Last Updated :May 13, 2022, 4:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.