టవర్​ ఎక్కి వైకాపా నేత హల్​చల్​, న్యాయం చేయాలని డిమాండ్​

author img

By

Published : Aug 23, 2022, 7:16 PM IST

YSRCP leader climbs tower to protest

YSRCP Leader climbs tower to protest అన్యాయానికి గురైన వారికి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోగా పోలీసులు తనను దుర్భాషలాడారని వైకాపా నేత సెల్​ టవర్​ ఎక్కి ఆందోళనకు దిగాడు. తనను దూషించిన ఎస్​ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశాడు. విషయం తెలుసుకున్న సీఐ అక్కడకు చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో అతను కిందకు దిగి వచ్చాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ హైడ్రామా 3 గంటల పాటు కొనసాగింది.

YSRCP leader protest: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో వైకాపా ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కాకిలేటి ఆనంద్ కుమార్ సెల్ టవర్ ఎక్కి హల్​చల్ చేశాడు. చిట్టవరంలో నిర్మిస్తున్న డ్రైన్ విషయంలో జరిగిన గొడవలో దళిత మహిళలపై కొందరు దాడి చేసి కులం పేరుతో దూషించారని.. వారిపై నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్​లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట్లు తెలిపాడు. కేసు పెట్టి నాలుగు రోజులైనా దాడి చేసిన వారిపై ఎటువంటి కేసు నమోదు కాలేదని.. ఈ విషయమై అడిగిన తనపై పరుష పదజాలంతో రూరల్ ఎస్సై ప్రియకుమర్ దూషించినట్లు పేర్కొన్నాడు. ఎస్సైను సస్పెండ్ చేయాలని,.. దళితులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ... ఆనంద్ కుమార్ సెల్ టవర్ ఎక్కాడు.

విషయం తెలుసుకున్న స్థానిక వైకాపా నాయకులు, సీఐ సంఘటన స్థలానికి చేరుకుని అనంద్​కుమార్​ను కిందకు దించేందుకు ఫోన్​లో సంప్రదింపులు జరిపారు. సుమారు మూడు గంటలపాటు హైడ్రామా నడిచింది. పోలీసులు ఆనంద్ కుమార్​తో తనకు తగిన న్యాయం చేస్తామని.. కిందికి దిగి రావాలని కొరారు. కేసు విషయమై పోలీసు స్టేషన్​కు వెళ్ళిన తనను దురుసుగా ప్రవర్తించి.. మహిళల ముందు అవమానించి, బెదిరించిన ఎస్సైపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆనంద్ కుమార్ డిమాండ్ చేశాడు. దళితులకు న్యాయం చేయాలని కోరారు. సమస్యలు పరిష్కస్తానని సీఐ శ్రీనివాస్ యాదవ్ హామీ ఇవ్వడంతో ఆనంద్​కుమార్​ కిందకు దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చదవండి:


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.