Clash: తేతలిలో అధికార పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణ.. పోలీసుల పహారా

author img

By

Published : Oct 10, 2021, 8:34 PM IST

clash between ysrcp party followers at tetali in west godavari

ఇంటి స్థలం విషయంలో తణుకు మండలం తేతలి గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కుర్చీలతో ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనటంతో.. పోలీసులు పహారా ఏర్పాటు చేశారు.

తేతలిలో అధికార పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణ.. పోలీసుల పహారా

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలో.. అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓ ఇంటి స్థలం విషయంలో.. ఇరు వర్గాలు పొట్లాటకు దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఏం జరిగిందంటే...?

వైఎస్ఆర్ ఆసరా పథకం కింద.. డ్వాక్రా మహిళలకు లబ్ధి అందించే కార్యక్రమంలో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళ్లిపోతున్న సమయంలో.. గ్రామ సర్పంచ్ సరెళ్ల కాంతిప్రియ వర్గానికి చెందిన వ్యక్తి ఒకరు.. తనకు అర్హత ఉన్నప్పటికీ ఇంటిస్థలం రాలేదని ఎమ్మెల్యేకు తెలిపారు. అర్హులందరికీ ఇంటి స్థలం వస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చి వెళ్లిపోయారు. ఇంటి స్థలం అడిగిన వ్యక్తిని నియోజకవర్గ యువజన నాయకుడు మట్టా వెంకట్ వర్గం వారు.. కొట్టడంతో వివాదం చెలరేగింది. దీంతో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. కుర్చీలు విసురుకున్నారు. పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను చెదరగొట్టారు.

వివాదం సద్దుమణిగినా.. తన వర్గానికి చెందిన వ్యక్తిపై వెంకట్ వర్గీయులు దాడి చేయడాన్ని సర్పంచ్ కాంతిప్రియ ఖండించారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో.. గ్రామంలో పోలీసులు పహారా ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

AP BJP: రాజధాని విషయంలో వైకాపా, తెదేపాలు విఫలం: సోము వీర్రాజు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.