పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో వినాయక ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. రెండువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దాదాపు గంటపాటు ఘర్షణ జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి.. ఇరువర్గాలను శాంతింపజేశారు. వినాయక ఊరేగింపు నిర్వహిస్తుండగా మహిళల ఫోటోలు తీశారని ఓ వర్గం వారు మరో వర్గంపై గొడవకు దిగారు. మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఓ వర్గానికి సంబంధించిన 8మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో వినాయక ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. రెండువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దాదాపు గంటపాటు ఘర్షణ జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి.. ఇరువర్గాలను శాంతింపజేశారు. వినాయక ఊరేగింపు నిర్వహిస్తుండగా మహిళల ఫోటోలు తీశారని ఓ వర్గం వారు మరో వర్గంపై గొడవకు దిగారు. మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఓ వర్గానికి సంబంధించిన 8మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.