పశ్చిమగోదావరి జిల్లాలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

author img

By

Published : Sep 21, 2021, 9:06 PM IST

Updated : Sep 21, 2021, 10:29 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

21:02 September 21

suicde btech breaking

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం చెరుకువాడలో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థి విశ్వేశ్వరరావు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విశ్వేశ్వరరావు ఆన్​లైన్​లో ఓ ప్రైవేట్ కంపెనీలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. అయితే విద్యార్థి సెల్​ఫోన్​లో.. అ కంపెనీ డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసినట్లు చాటింగ్ బయటపడింది. అందులో మీకు ఇచ్చిన పని పూర్తి చేయలేదంటూ..రూ.1.40 లక్షలు గంటన్నరలో చెల్లించాలని కంపెనీ బెదిరింపులకు పాల్పడింది. అప్పటికే కొంత మెుత్తాన్ని విద్యార్థి చెల్లించాడు. మిగిలిన మెుత్తాన్ని చెల్లించాలంటూ ఫోన్ చేసి ఒత్తిడి తీసుకురావటంతో ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెనుగొండ పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

హెబియస్ కార్పస్ పిటిషన్​పై రెండు రోజుల్లో నివేదిక సమర్పించండి: హైకోర్టు

Last Updated :Sep 21, 2021, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.