MPP ELECTIONS: ఎంపీపీ ఎన్నికల్లో తెదేపా, జనసేన మధ్య సయోధ్య

author img

By

Published : Sep 24, 2021, 9:47 AM IST

agreement-between-tdp-and-janasena-in-achanta-mpp-elections

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎంపీపీ ఎన్నికల్లో తెదేపా, జనసేన ఒప్పందం కుదుర్చుకున్నారు. తెదేపాకు ఎంపీపీ పదవి, జనసేనకు ఉపాధ్యక్ష పదవి ఇచ్చుకునేందుకు రెండు పార్టీలు ఒప్పందం చేసుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎంపీపీ ఎన్నికల్లో తెదేపా, జనసేన మధ్య సయోధ్య కుదిరింది. తెదేపాకు ఎంపీపీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు జనసేన సమ్మతం తెలిపింది. అలాగే తెదేపా జనసేనకు ఉపాధ్యక్ష పదవికి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తెదేపాకు ఏడుగురు, జనసేనకు నలుగురు ఎంపీటీసీలు ఉండగా... ఆరుగురు ఎంపీటీసీలతో వైకాపా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తోంది.

ఇదీ చూడండి: MPP ELECTIONS: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.