Attack: రెచ్చిపోయిన వైకాపా నాయకులు.. తెదేపా మహిళా సర్పంచ్‌పై దాడి

author img

By

Published : Aug 3, 2022, 5:10 PM IST

తెదేపా మహిళా సర్పంచ్‌పై వైకాపా నాయకుల దాడి

Attack On TDP Women Sarpanch: తెదేపా మహిళా సర్పంచ్‌పై వైకాపా నాయకులు దాడికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపల్లిలో జరిగింది. స్థలం విషయమై వైకాపా నాయకులు తనపై దాడి చేశారని సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

YSRCP Leaders Attack On TDP Women Sarpanch: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపల్లిలో తెలుగుదేశం సర్పంచ్‌ గాయత్రిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. సర్పంచ్‌ ఇంటికి సమీపంలో స్థలం విషయంలో.. కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి. ఖాళీ స్థలంలో తెదేపా సర్పంచ్‌.. రేకుల షెడ్‌ నిర్మించారు. ఈ స్థలానికి సంబంధించి తన వద్ద దస్త్రాలు కూడా ఉన్నాయని సర్పంచ్‌ చెబుతున్నారు. అయినా కొంతకాలంగా వైకాపా నేతలు దౌర్జన్యం చేస్తున్నారని .. ఈ క్రమంలో తనపై దాడి చేశారని తెదేపా సర్పంచ్ గాయత్రి వాపోయారు. షెడ్‌నూ కూల్చివేశారని వాపోయారు. దీనిపై సర్పంచ్ గాయత్రి.. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెదేపా మహిళా సర్పంచ్‌పై వైకాపా నాయకుల దాడి

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.