చంపావతి నదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం తుమ్ముకాపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలుపాడ్యమి సందర్భంగా మల్లునాయుడు పేటలో భోజనాలకు వచ్చిన విద్యార్థులు.. కాలకృత్యాలు తీర్చు కోవడానికి చంపావతి నది వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో మొత్తం ఐదుగురు నదిలోకి దిగారు. వారంతా ప్రమాదవశాత్తు నీటిలోకి జారిపోయారు.
నదీ ప్రవాహంలో అయిదుగురు మునిగిపోతుండగా అటుగా వచ్చిన స్థానికుడు బెల్లాన ఆదినారాయణ.. ఇద్దరు విద్యార్థులను కాపాడారు. మరో విద్యార్థి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. మిగిలిన ఇద్దరు విద్యార్థులు నదిలో గల్లంతయ్యారు.
గల్లంతైన విద్యార్థులు.. ఎం.కొత్తవలసకు చెందిన గెడ్డాపు భార్గవ్, గెడ్డాపు లోకేష్గా గుర్తించారు. వీరు 10వ తరగతి చదువుతున్నారు.
ఇదీ చదవండి: ap rains: రాష్ట్రంపై వాయు'గండం'... 28 మంది మృత్యువాత ,17 మంది గల్లంతు