విజయనగరంలో సౌత్​ ఇండియా షాపింగ్​ మాల్​ ప్రారంభోత్సవం.. సందడి చేసిన హీరోయిన్లు

author img

By

Published : Dec 2, 2022, 5:42 PM IST

SOUTH INDIA SHOPPING MALL IN VIZIANAGARAM

SOUTH INDIA SHOPPING MALL IN VIZIANAGARAM :సినీ తారలు రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌.. విజయనగరంలో మెరిశారు. కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్‌ ఇండియా షాపింగ్ మాల్‌ను.. ప్రారంభించారు. అనంతరం దుకాణంలో తిరిగి వివిధ విభాగాలను పరిశీలించారు. ఆభరణాలను అలంకరించుకుని మురిసిపోయారు.

SOUTH INDIA SHOPPING MALL : సంప్రదాయాల్ని, అధునాతన వస్త్రశైలిని ఇష్టపడే ఉత్తరాంధ్ర ప్రజల అభిరుచి దృష్ట్యా., సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 28వ షోరూం ను విజయనగరంలో ప్రారంభించింది. ఈ షాపింగ్​ మాల్​ని ప్రముఖ సినీతారలు రాశీఖన్నా, పాయల్ రాజ్​పుత్ ప్రారంభించారు. అనంతరం ఆభరణాలు ధరించి షోరూంలో సందడి చేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్లు సురేష్ సీర్న, అభినయ్, రాకేష్, రాజేష్​తో పాటు., షాపింగ్ మాల్ మొత్తం తిరిగి వస్త్రశ్రేణి, ఆభరణాలు, కలెక్షన్స్​ను పరిశీలించారు.

ఒక కుటుంబంలోని అన్ని తరాల వారి అభిరుచులు, అవసరాలకు తగ్గట్టు విస్తృత, వైవిధ్యమైన వస్త్రాలు, ఆభరణాలను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విజయనగరంలో అందుబాటులోకి తీసుకొచ్చిందని హీరోయిన్లు తెలిపారు. తమ షాపింగ్ మాల్​లో 4లక్షల పైచిలుకు వైరైటీలు ఉన్నాయని.. మెన్స్, ఉమెన్స్, కిడ్స్​వేర్​తో పాటు.. 916హాల్ మార్క్​ ఆభరణాలు ఉన్నాయని షాపింగ్​మాల్​ ప్రతినిధులు తెలిపారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 28వ షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సినీతారలను చూసేందుకు విజయనగరం ప్రజలు పెద్దఎత్తున తరలిరావటంతో.. షాపింగ్ మాల్ పరిసర ప్రాంతాలన్నీ జనసందోహంగా మారాయి.

విజయనగరంలో సౌత్​ ఇండియా షాపింగ్​ మాల్​ ప్రారంభోత్సవం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.