విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం బోయితలి అటవీ ప్రాంతంలో కూంబింగ్కు వెళుతున్న గ్రేహౌండ్స్ పోలీసులపై కందిరీగలు దాడి చేశాయి. కందిరీగల దాడిలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. వీరిని జి.మాడుగుల ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు పోలీసులను పాడేరు ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా వాటిని నియంత్రించేందుకు విశాఖ ఏజెన్సీలో గ్రేహౌండ్స్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి : BEAR DEATH: విద్యుదాఘాతంతో ఎలుగుబంటి మృతి..