వైకాపా గూటికి స్వతంత్ర అభ్యర్థులు..!

author img

By

Published : Mar 15, 2021, 3:27 PM IST

rebel candidates won in vishakapatnam are going to join in ycp

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో.. పురపాలక ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశారు. వారంతా వైకాపా కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన వారంతా ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్​ను కలిశారు. స్వతంత్ర అభ్యర్దులుగా విజయం సాధించిన కందుల నాగరాజు, విల్లూరి భాస్కరరావులు వైకాపా తరఫున పోటీ చేయాలని భావించారు. వీరిద్దరికి సీటు దక్కకపోవటంతో.. రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఎంపీని కలిసిన వీరు.. తిరిగి వైకాపాలో చేరనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

'తాడిపత్రిలో ఆ నలుగురు ఎమ్మెల్సీలకు ఎక్స్అఫీషియో అర్హత లేదు'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.