విశాఖ దక్షిణ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన వారంతా ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ను కలిశారు. స్వతంత్ర అభ్యర్దులుగా విజయం సాధించిన కందుల నాగరాజు, విల్లూరి భాస్కరరావులు వైకాపా తరఫున పోటీ చేయాలని భావించారు. వీరిద్దరికి సీటు దక్కకపోవటంతో.. రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఎంపీని కలిసిన వీరు.. తిరిగి వైకాపాలో చేరనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి:
'తాడిపత్రిలో ఆ నలుగురు ఎమ్మెల్సీలకు ఎక్స్అఫీషియో అర్హత లేదు'