Avanthi: పరిషత్ విజయం మాపై బాధ్యతను మరింత పెంచింది: అవంతి

author img

By

Published : Sep 24, 2021, 5:20 PM IST

పరిషత్ విజయం మాపై బాధ్యతను మరింత పెంచింది

పరిషత్ ఎన్నికల్లో(Parishad elections) విజయం తమపై బాధ్యతను మరింత పెంచిందని మంత్రి అవంతి శ్రీనివాస్ (Minister Aanthi Srinivas) అన్నారు. ప్రజలు ఏకపక్షంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నమ్ముతున్నారన్నారని వ్యాఖ్యనించారు.

విశాఖ జిల్లాలో అన్ని ఎంపీపీ (MPP) స్థానాలను వైకాపా సొంతం చేసుకుందని మంత్రి అవంతి శ్రీనివాస్ (Minister Aanthi Srinivas) అన్నారు. తెదేపా ఆవిర్భావం నుంచి భీమిలిలో ఆ పార్టీ అభ్యర్థి ఎంపీపీగా కొనసాగుతుండగా.. మొదటి సారి భీమిలి మండల ఎంపీపీ పదవిని వైకాపా సొంతం చేసుకుందన్నారు. ఈ విజయం తమపై బాధ్యతను మరింత పెంచిందన్నారు. ప్రజలు ఏకపక్షంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) నాయకత్వాన్ని నమ్ముతున్నారన్నారు. ఏ ఎన్నికలు జరిగినా వైకాపాకు తిరుగులేని విజయాన్ని కట్టబెడుతున్నారన్నారు. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన అవంతి.. క్షేత్రస్థాయిలో నాయకులందరిని సమన్వయ పరుచుకొని అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు.

ఇదీ చదవండి

CM Jagan: వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష.. రాత్రి కర్ఫ్యూపై కీలక నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.