పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి: మంత్రి అవంతి

author img

By

Published : Sep 26, 2021, 10:37 PM IST

Updated : Sep 26, 2021, 11:04 PM IST

Avanthi

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి ఏదో చేద్దాం, ఏదైనా అవ్వాలని అనుకుంటే ముందుగా హైదరాబాద్ నుంచి ఏపీకి రావాలని పవన్​కు మంత్రి అవంతి సూచించారు. అంతేగాని చంద్రబాబులా హైదరాబాదులో ఉండి మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సినిమా షూటింగ్ చిత్రీకరణలు విదేశాల్లో కాకుండా మన రాష్ట్రంలో చేపట్టాలని హితవు పలికారు.

మంత్రి అవంతి శ్రీనివాస్

జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ మానసిక స్థితి సరిగా లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చాలా పుస్తకాలు చదివే పవన్​.. గౌతమ బుద్ధుని చరిత్ర గురించి తెలుసుకోవాలన్నారు. బుద్ధుడు సూచించిన ఉపాసన ధ్యానం చేయాలన్నారు. ధ్యాన కేంద్రం హైదరాబాద్ లోనే ఉందని 10 రోజులు అక్కడ ఉంటే ఆవేశం తగ్గుతుందని చురకలంటించారు. రాజకీయ నాయకులకు కావాల్సింది ఆవేశం కాదని ఆలోచన తో కూడిన సహనం ఉండాలన్నారు. ఓ మంత్రి పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని.. బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు నైతిక విలువలు ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా భాజపాతో మాట్లాడాలని లేనిపక్షంలో ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవాలన్నారు.

ముందు రాష్ట్రానికి వచ్చి మాట్లాడు

"పవన్​ కల్యాణ్​కు అన్ని విషయాల్లో ఫారెన్​ వ్యామోహం ఎక్కువ. మన రాష్ట్రంలో ఒక్క సినిమా షూటింగ్​ ఆయన చేయలేదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సినిమా షూటింగ్ చిత్రీకరణలు విదేశాల్లో కాకుండా మన రాష్ట్రంలో చేపట్టాలి. ఆయన మన రాష్ట్రంలో షూటింగ్​లు చేయాలి" అని మంత్రి అవంతి అన్నారు. గులాబ్ తుఫాన్ నేపథ్యంలో విశాఖ జిల్లా భీమునిపట్నం సముద్ర తీర ప్రాంతం వద్ద అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: Pawan: సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. వైకాపా నేతలకు పవన్ వార్నింగ్

Last Updated :Sep 26, 2021, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.