GULAB EFFECT: అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల శాఖ

author img

By

Published : Sep 26, 2021, 4:29 PM IST

minister kanababu

గులాబ్​ తుపాన్​పై విశాఖ జిల్లా అధికారులతో విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు సమీక్ష చేపట్టారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర మండలాల ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలని ఆదేశించారు.

గులాబ్​ తుపాన్ ప్రభావంపై విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు.. విశాఖ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్, రెవెన్యూ, అగ్నిమాపక, పోలీసు, ఆర్​ అండ్​ బీ, జీవీఎంసీ, మత్స్యశాఖల అధికారులు, సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని సూచించారు. అవసరమైన సహాయ సామగ్రి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తీర మండలాల ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలని ఆదేశించారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేవలు వినియోగించుకోవాలన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దన్నారు. ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది సహా ఇతర విభాగాల వారంతా సిద్ధంగా ఉన్నారని.. జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు.

ఇదీ చదవండీ.. పాడేరులో ఇద్దరు వైకాపా ఎంపీటీసీలపై బహిష్కరణ వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.