gulab cyclone: విశాఖకు సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్... తుపాన్ పై సమీక్ష

author img

By

Published : Sep 26, 2021, 10:33 PM IST

Updated : Sep 26, 2021, 10:47 PM IST

విశాఖ చేరుకున్న సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్

22:29 September 26

ap cs breaking

సీఎస్ ఆదిత్యనాథ్ దాస్(ap cs news) విశాఖ చేరుకున్నారు. తుపాన్ ప్రభావం(gulab cyclone news), సహయ చర్యలపై కలెక్టర్ తో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జేసీ, జీవీఎంసీ కమిషనర్, ఎస్పీ పాల్గొన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. తుపాన్ తీవ్రత పూర్తిగా తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయనగరం, శ్రీకాకుళం కలెక్టర్లతో సీఎస్ ఫోన్​లో మాట్లాడారు. తుపాన్ సహాయ చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేపు ఉదయం శ్రీకాకుళం వెళ్లి  సమీక్ష నిర్వహించనున్న సీఎస్... అనంతరం విజయనగరంలో తుపాన్ పరిస్థితి పై ఆరా తీయనున్నారు.

ఇదీ చదవండి:

రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Last Updated :Sep 26, 2021, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.