ఆగని అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.. తిరుపతిలో మహిళ బలవన్మరణం

author img

By

Published : Jan 24, 2023, 8:46 PM IST

Updated : Jan 24, 2023, 9:10 PM IST

woman committed suicide in Tirupati

woman committed suicide in Tirupati: అధికార పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా దోపిడీ, దౌర్జన్యాలతో చెలరేగిపోతున్నారు. భూమి కనిపిస్తే చాలు ఆక్రమించడానికి రెడీగా ఉంటున్నారు. ఎక్కడైనా స్థలం ఖాళీగా కనిపిస్తే మాకే చెందుతుందని జెండా పాతేస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలో అధికార పార్టీ నేతల భూదాహానికి ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది.

woman committed suicide in Tirupati: అధికార పార్టీ నేతల భూదాహానికి తిరుపతి జిల్లాలో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని బీరమాకుల కండ్రిగ గ్రామానికి చెందిన 50 ఏళ్ల కన్నమ్మ.. తన ఇంటికి దారి లేకుండా చేశారనే మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అధికార పార్టీ నేతల అండతో ఓ వ్యక్తి ఇంటిని అనుకుని ఉన్న గ్రామకంఠం భూములను చదును చేశారని మృతురాలి బంధువులు ఆరోపించారు.

న్యాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని మండిపడ్డారు. న్యాయం జరిగే వరకు దహన సంస్కారాలు కూడా చేయబోమని బంధువులు భీష్మించుకుని కూర్చున్నారు. పేదలకు ప్రభుత్వం చేసే న్యాయం ఇదేనా అని నిలదీస్తున్నారు.

ఆగని అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.. తిరుపతిలో మహిళ బలవన్మరణం

ఇవీ చదవండి:

Last Updated :Jan 24, 2023, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.