లారీని ఢీకొన్న ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

author img

By

Published : Jun 19, 2022, 12:13 PM IST

1

Accident: తిరుపతి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. నరసాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు.. ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్​, క్లీనర్​తో పాటు.. కొంతమంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి బస్సు ఓవర్​ స్పీడే కారణమని పోలీసులు భావిస్తున్నారు.


Private Travels bus hit to Lorry: తిరుపతి జిల్లా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పేరూరు బండ వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో బస్సులోని డ్రైవర్, క్లీనర్​తో పాటుగా మరికొంతమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. నరసాపురం నుంచి బెంగళూరుకు 30 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు పేరూరు బండ వద్ద ముందు వెళుతున్న సిమెంటు లారీని ఢీకొంది. ఈ ఘటనలో ప్రైవేటు బస్సు ముందర భాగం నుజ్జునుజ్జయ్యింది. డ్రైవర్ బస్సు క్యాబిన్​లో ఇరుక్కుపోవడంతో పోలీసులు.. స్థానికుల సహాయంతో బస్సుకు ఉన్న ఇనుప చువ్వలు తొలగించి డ్రైవర్, క్లీనర్​తో పాటు ప్రయాణికుల్ని 108 లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మరికొందరికి స్వల్ప గాయాలు కాగా వారు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఎం.ఆర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

క్యాబిన్​లో ఇరుక్కున్న డ్రైవర్​ను బయటకు తీస్తున్న స్థానికులు
క్యాబిన్​లో ఇరుక్కున్న డ్రైవర్​ను బయటకు తీస్తున్న స్థానికులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.