పచ్చి మాంసం పందెం.. తీసింది ఓ వ్యక్తి ప్రాణం !

author img

By

Published : Jun 22, 2022, 4:33 PM IST

పచ్చి పంది మాసంపై పందెం

Pork Meat: అకతాయిగా చేసే పనులు కొన్నిసార్లు లేనిపోని కష్టాలను తెచ్చిపెడుతుంటాయి. మరికొన్ని సార్లు ప్రాణాలనే బలి తీసుకుంటాయి. అలా అర్థాంతరంగా తనువు చాలించిన వారెందరో. అచ్చం అలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చోటు చేసుకుంది. పచ్చి పంది మాంసం తినటానికి పందెం కాసి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

Pork Meat: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆంధ్రా వీధికి చెందిన యర్ర ఈశ్వరరావు చిరు వ్యాపారి. రోడ్డు పక్కన పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉదయం పంది మాంసం కోసం దుకాణానికి వెళ్లిన ఈశ్వరరావు.. ఓ ముక్కను నోట్లో వేసుకున్నాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అతని స్నేహితులు మరో ముక్క తినాలని అకతాయిగా పందెం కాశారు.

ఎలాగైనా పందెం గెలవాలనుకున్న ఈశ్వరరావు ఓ ముక్కను నోట్లో వేసుకున్నాడు. అదికాస్త గొంతుకు అడ్డం పడి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. కిందపడి గిలగిలా కొట్టుకోవటంతో ఆందోళన చెందిన అతని స్నేహితులు.. ఓ రిక్షాపై హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతుడు ఈశ్వరరావుకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోవటంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అకతాయిగా చేసిన ఓ పని.. ఆ కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది. కాగా..ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.

ఇవీ చూడండి

Live Video: షటిల్ ఆడుతూ.. కోర్టులోనే కుప్పకూలిన యువకుడు !

ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్​లో వాళ్లే !

'బలవంతంగా తీసుకెళ్లి ఇంజెక్షన్లు ఇచ్చారు'.. శివసేన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.