గ్రామ సచివాలయ ఉద్యోగల తీరుపై అసంతృప్తి.. చెప్పుతో కొట్టుకున్న వాలంటీర్ !

author img

By

Published : Jun 21, 2022, 2:14 PM IST

గ్రామ సచివాలయ ఉద్యోగల తీరుపై అసంతృప్తి

గ్రామ సచివాలయ ఉద్యోగుల తీరుతో విసిగిపోయిన ఓ వాలంటీర్.. తనను తాను చెప్పుతో కొట్టుకున్నాడు. ఈ ఘటన సత్యసాయి జిల్లా కదిరి మండలం యర్రదొడ్డిలో చోటుచేసుకుంది. తన క్లస్టర్ పరిధిలోని రైతులకు పంట బీమా ఇప్పించలేకపోయానంటూ వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జరిగిన అన్యాయంపై సచివాలయ ఉద్యోగులకు చెప్పినా.. పట్టించుకోవటం లేదని చెప్పుతో కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం యర్రదొడ్డిలో 12 వందల మందికి పైగా రైతులు ఉన్నారు. కానీ పదుల సంఖ్యలో రైతులకు మాత్రమే బీమా వచ్చింది. వ్యవసాయశాఖ, సచివాలయ ఉద్యోగుల వల్లే అర్హులకూ పరిహారం అందలేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. సచివాలయానికి తాళం వేశారు. అదే సమయంలో బోడేనాయక్ తండా వాలంటీర్ నాగేష్ నాయక్ అక్కడికి వచ్చారు. తన క్లస్టర్ పరిధిలోని రైతులకు బీమా ఇప్పించలేకపోయానంటూ ఆవేదన చెందారు. రైతులకు అన్యాయం జరిగిన విషయం సచివాలయ ఉద్యోగులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో... ఈ ఉద్యోగానికో దండం అంటూ చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపారు.

గ్రామ సచివాలయ ఉద్యోగల తీరుపై అసంతృప్తి

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.