Argument Between Friends In Cricket: సరదాగా క్రికెట్ ఆడేందుకు వెళ్లిన యువకుల మధ్య చిన్నపాటి వాగ్వాదంతో చోటు చేసుకున్న గొడవ ఒకరి ప్రాణం మీదికి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కట్టెల తండాకు చెందిన అంజినాయక్ తోటి వారితో కలిసి గ్రామానికి సమీపంలో క్రికెట్ ఆడుకున్నారు. ఈ సమయంలో అంజి నాయక్ మరో యువకుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం ఘర్షణకు దిగారు. ఘటనలో అంజి నాయక్ కింద పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మిగతా యువకులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించిన అంజినాయక్ పరిస్థితి అలానే ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం యువకుడిని అనంతపురం వైద్యశాలకు తరలించారు.
ఇవీ చదవండి