ప్రకాశం జిల్లాలో విషాదం.. విద్యుత్​​ వైర్లు మీద పడి మహిళ సజీవదహనం

author img

By

Published : May 10, 2022, 12:01 PM IST

Woman dead with electric shock

Woman dead with electric shock: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. విద్యుత్​ వైర్లు తెగి మీదపడి మహిళ సజీవదహనమైంది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.

Woman dead with electric shock: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా కంభం మండలం లింగాపురంలో ఇంటి ముందు నిద్రిస్తున్న మహిళ ఫాతిమాపై.. 11 కేవీ విద్యుత్ వైరు తెగిపడ్డాయి. దీంతో మంటలు చెలరేగి ఆమె సజీవదహనమైంది. ఫాతిమాను కాపాడే ప్రయత్నంలో మరో మహిళ రామలింగమ్మకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉంటడంతో నరసరావుపేటకు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.