ప్రభుత్వమే తమను ఆదుకోవాలి: చేనేత కార్మికులు

author img

By

Published : Nov 24, 2021, 9:19 AM IST

rain

ప్రకాశం జిల్లా(prakasam district)లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తోటివారిపాలెంలోని చంద్రమౌళీ చేనేత కాలనీ నీటమునిగింది. మగ్గాలు వర్షానికి తడిసిపోయాయని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని చేనేత కార్మికులు(Handloom workers) కోరుతున్నారు.

15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం జిల్లా(rains in prakasam district)లో జనజీవనం అస్తవ్యస్తమయింది. చీరాల పట్టణంలోని లోటట్టు ప్రాంతాలతో పాటు ఈపురుపాలెం చేనేత కాలనీలు నీటమునిగాయి. నీళ్లల్లోనే రాకపోకలు సాగిస్తుండటంతో... వ్యాధులు ప్రభులుతాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

తోటివారిపాలెంలోని చంద్రమౌళీ చేనేత కాలనీ నీటమునిగింది. కాలనీలోని 123 ఇళ్లలోని వరద నీరు ముంచెత్తింది. కాలనీలో 20 చేనేత మగ్గాలు వర్షానికి తడిసిపోయాయని.. ఒక్కో మగ్గానికి రూ.5-7 వేలు విలువ చేసే నూలు తడిపోయిందని చేనేత కార్మికులు(Handloom workers) ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏ అధికారులు ఇటువైపు రాలేదని వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

PRAKASHAM-RAINS : భారీ వర్షాలు.. పొంగి పొర్లుతున్న జలాశయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.