అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువు.. సచివాలయంలో వీరంగం

author img

By

Published : Jan 19, 2023, 3:26 PM IST

Updated : Jan 19, 2023, 6:05 PM IST

సచివాలయంలో వీరంగం

Mla Relative Misbehave : ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి సచివాలయానికి వెళ్లి దురుసుగా ప్రవర్తించాడు. ఎమ్మెల్యే బంధువునంటూ అసభ్యపదజాలంతో సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా.. నానా హంగామా చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

సచివాలయంలో దురుసుగా ప్రవర్తించిన అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువు

Mla Relative Misbehave : ప్రకాశం జిల్లాలోని ఓ వ్యక్తి సచివాలయంలో దురుసుగా ప్రవర్తించాడు. తన తల్లి పింఛన్​ ఎందుకు తొలగించారంటూ సచివాలయ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. నేను ఎమ్మెల్యే బంధువునంటూ సచివాలయంలో నానా హంగామా సృష్టించాడు. కార్యాలయంలోని కుర్చీలను ఇష్టమొచ్చినట్లు విసిరేశాడు. సిబ్బంది చెప్పిన వినకుండా దుర్భాషలాడాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువనే కారణంతో.. సిబ్బంది చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు.

ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన పింఛన్లలో మార్కాపురం మండలం భూపతిపల్లిలోని పింఛన్లు రద్దయ్యాయి. రద్దైన వాటిలో సూరెడ్డి సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి తల్లి పింఛన్ కూడా​ ఉంది. దీంతో ఆగ్రహనికి గురైన సత్యనారాయణ రెడ్డి సచివాలయానికి వెళ్లి హల్​చల్​ చేశాడు.

నేను ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి బంధువుని అంటూ.. సచివాలయ సిబ్బందితో పింఛన్​ తొలగింపుపై వాదనకు దిగాడు. సిబ్బంది సమాధానం చెప్పిన వినిపించుకోకుండా వారితో దుర్భాషలాడాడు. అంతేకాకుండా కార్యాలయంలో ఉన్న కుర్చీలను విసిరేస్తూ హల్​చల్​ చేశాడు. అతని కుటుంబానికి 22ఎకరాల భూమి ఉన్నందుకే అతని తల్లికి పింఛన్​ రద్దైందని సిబ్బంది అంటున్నారు. ఈ విషయం అతనికి చెప్పిన వినిపించుకోకుండా.. కార్యాలయంలో నానా హంగామ చేశాడంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 19, 2023, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.