వైకాపాలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ..పలువురికి గాయాలు

author img

By

Published : Sep 26, 2021, 10:16 PM IST

ఆందోళన చేస్తున్న దృశ్యం

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పోదలకుంటపల్లిలో వైకాపాలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి.


ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పోదలకుంటపల్లిలో వైకాపాలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇరు వర్గాల వారికి గాయాలయ్యాయి. అయితే ఒక వర్గం వారు.. గిద్దలూరు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయి రవాణాకు అంతరాయం కలిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.

ఇదీ చదవండి:

వజ్రపుకొత్తూరులో ఇద్దరు మత్స్యకారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.