నీటి నిల్వ కోసం నిర్మించిన చెక్ డ్యాం పేల్చివేత.. పరారీలో నిందితుడు

author img

By

Published : Nov 29, 2022, 4:59 PM IST

CHECK DAM BLAST

CHECK DAM BLAST IN PRAKASAM : గత ప్రభుత్వం నీటి నిల్వ కోసం తొమ్మిదిన్నర లక్షల రూపాయలతో ఓ చెక్​డ్యాంను నిర్మించింది. అయితే ఆ చెక్​డ్యాం తన పొలం వద్ద ఉందని ఆగ్రహించిన ఓ వ్యక్తి దానిని రాత్రికి రాత్రే కూల్చివేశాడు.

CHECK DAM BLAST AT PRAKASAM DISTRICT: ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలో నీటి నిల్వ కోసం నిర్మించిన చెక్ డ్యాంను మల్లిఖార్జున్​ అనే వ్యక్తి కూల్చివేశాడు. గత ప్రభుత్వ హయాంలో నల్లవాగుపై తొమ్మిదిన్నర లక్షల రూపాయలతో చెక్ డ్యాం నిర్మించారు. తన పొలం వద్ద చెక్ డ్యాం నిర్మించారని ఆగ్రహం చెందిన మల్లిఖార్జున్​.. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు జిలెటిన్ స్టిక్స్‌తో రాత్రికి రాత్రే పేల్చివేశాడు. దాంతో చెక్ డ్యాం పూర్తిగా ధ్వంసమైంది. చెక్ డ్యాం ధ్వంసమైన స్థలాన్ని ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ఆ ఘటనకు కారణమైన మల్లిఖార్జున్​పై పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మల్లిఖార్జున్​ వైసీపీకి మద్దతుదారుడిగా ఉన్నట్లు సమాచారం.

నీటి నిల్వ కోసం నిర్మించిన చెక్ డ్యాం పేల్చివేత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.