అక్రమ వాటర్ ప్లాంట్​ను తొలగించాలంటూ నోటీసు.. ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

author img

By

Published : Jan 23, 2023, 8:14 PM IST

Updated : Jan 23, 2023, 8:22 PM IST

MLA vikram reddy

MLA Started Illegal Pipeline Connection Water Plant: అక్రమ వాటర్ ప్లాంట్ ను తొలగించాలంటూ.. అధికార్లు నోటీసు ఇచ్చినా, ఎమ్మెల్యే ప్లాంట్ ను ప్రారంభించడం నెల్లూరు జిల్లాలో చర్చాంశనీయమైంది. నెల్లూరు జిల్లాలోని శెట్టి సముద్రం గ్రామంలో నిబంధనలకు విరుద్దంగా పైపులైను కనెక్షన్ తీసుకొని వాటర్ ప్లాంట్​ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ప్రారంభానికి ఎమ్మెల్యేనే రావడంతో ఈ ఘటన ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

MLA Started Illegal Pipeline Connection Water Plant: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం శెట్టి సముద్రం గ్రామంలో.. వైసీపీ నేతలు వాటర్ ప్లాంట్​ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని ఆహ్వానించారు.

అక్రమ పైప్​లైన్ కనెక్షన్ తొలగించాలని వాటర్ ప్లాంట్​కు నోటీసు
అక్రమ పైప్​లైన్ కనెక్షన్ తొలగించాలని వాటర్ ప్లాంట్​కు నోటీసు

అయితే, ప్రారంభోత్సవానికి ముందే, వాటర్ ప్లాంట్​కు అక్రమ పైప్​లైన్ ఇచ్చారని.. కనెక్షన్ తొలగించాలని.. అధికారులు వాటర్ ప్లాంట్​కు నోటీసు అంటించారు. నోటీసు అంటించి ఉన్నా, ఎమ్మెల్యే వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. దీంతో స్థానికులు ఔరా.. ! అంటూ ముక్కున వేలు వేసుకున్నారు. అయితే, ఇది నియోజక వర్గంలో పార్టీల అంతర్గత పోరులో భాగంగా.. ఈ వాటర్ ప్లాంట్ రాజకీయాలు జరిగాయనే వాదన జరుగుతోంది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వర్గం వారు పాల్గొనక పోవటం విశేషం. అక్రమ కనెక్షన్ తీసుకొని.. దాని ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేని పిలిచి.. అవమానపరిచారని ప్రజలు అంటున్నారు. అక్రమంగా నీటి కనెక్షన్ ఇవ్వటంపై.. సర్పంచ్​ వర్గం వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 23, 2023, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.