209 ఎకరాల భూ రికార్డులు తారుమారు.. రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసు

author img

By

Published : Sep 26, 2021, 4:09 PM IST

Updated : Sep 26, 2021, 5:24 PM IST

రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసు

16:07 September 26

NLR_ Case on Revenue officials_209 acres golmal_BReaking

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో జరిగిన భూముల గోలుమాల్​ వ్యవహారంలో రెవెన్యూ అధికారులపై పోలీసులు క్రిమినల్​ కేసులు నమోదు చేశారు. ఇద్దరు రెవెన్యూ అధికారులను, 11మంది ప్రవేటు వ్యక్తులతో కలిపి మొత్తం 13 మందిపై కేసు నమోదు చేశారు.

గతంలో తమ్మినపట్నంలో 209 ఎకరాల పోర్టు భూముల భూ రికార్డుల తారుమారులో తహసీల్దార్​, ఆర్ఐ, కంప్యూటర్ ఆపరేటర్​పై ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టారు. ఇద్దరు రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేశారు. భూ రికార్డుల తారుమారులో ప్రమేయం ఉన్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ గీత వాణి, ఆర్​ఐ సిరాజ్​పై క్రిమినల్​ కేసులు నమోదు చేశారు.
 

ఇదీ చదవండి: MINISTER ANIL: రూ.550 కోట్లతో నెల్లూరు నగర అభివృద్ధి: మంత్రి అనిల్

Last Updated :Sep 26, 2021, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.