'రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ.. వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తున్నాం'

author img

By

Published : May 12, 2022, 9:22 PM IST

అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు

చిన్న గాయమైనా.. ప్రాణాపాయ స్థితి అయినా.. ఆస్పత్రికి వెళ్తే మొదట స్పందించేది నర్సులే. వైద్యులు వచ్చి రోగిని పరిశీలించేంత వరకు వారికి నర్సులే సేవలందిస్తారు. ఒక రోగి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కోలుకుని ఇంటికి వెళ్లే వరకు వారిని బాధ్యతగా చూసుకుంటారు. వైద్య సేవల్లో వారి పాత్ర ఎంతో కీలకం. నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మన్యం జిల్లా కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలోని నర్సులు వారి సేవలను గుర్తు చేసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ.. వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తున్నామని వాళ్లు చెప్పారు.

కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు

ఇదీ చదవండి: విశాఖ వధువు మృతికేసులో ఊహించని ట్విస్ట్.. పోలీసులు ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.